కాకినాడ‌లో టీడీపీ గెలుపున‌కు ముద్ర‌గడ ఇలా హెల్ఫ్ చేశారా…

ఏపీలో వారం రోజులు తిర‌క్కుండానే అధికార టీడీపీకి రెండో గుడ్ న్యూస్‌. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఈ రోజు కాకినాడ‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లోను స‌త్తా చాటింది. నంద్యాల‌లోలాగానే కాకినాడ‌లోను వార్ వ‌న్‌సైడ్ అయిపోయింది. నంద్యాల‌లో సానుభూతి సెంటిమెంట్ బాగా ప‌నిచేసింద‌ని, మంత్రులంతా అక్క‌డే దిగిపోయార‌ని, చంద్ర‌బాబు ఏకంగా రూ.1200 కోట్లు రిలీజ్ చేశార‌ని, అధికార దుర్వినియోగం జ‌రిగిపోయింద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. స‌రే జ‌గ‌న్ చెప్పిన దాంట్లో కూడా కాస్త […]

ఏపీ రాజ‌కీయాలు ఇలానే ఉంటే ఎవ‌రికి లాభం..?

రాష్ట్ర రాజ‌కీయాలు ఏక‌ప‌క్షం అవుతున్నాయా? రాష్ట్రంలో టీడీపీ కేంద్రంగా రాజ‌కీయం మారిపోతోందా? విప‌క్షాలను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డంలేదా? దేశంలో అతి పెద్ద, అతి సీనియ‌ర్ జాతీయ రాజ‌కీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామ‌రూపాలు లేకుండా పోతోందా? ముఖ్యంగా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ కుకంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీ నిలువ‌నీడ కోల్పోయి అలో ల‌క్ష్మ‌ణా అంటోందా? ఏపీ ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న జ‌గ‌న్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైందా? అంటే.. తాజా రెండు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఔన‌నే స‌మాధాన మిస్తున్నాయి. […]

బీజేపీకి కాకినాడ రిజ‌ల్టే…ఏపీలోను వ‌స్తుందా..!

మేం సొంతంగా ఎదుగుతాం. మాకూ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ప‌థ‌కాలు మాకు పెద్ద ప్ల‌స్‌. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు, అవినీతికి వ్య‌తిరేక పోరాటం వంటివి మాకు ప్ర‌ధాన బ‌లాలు. ఏపీలో బాబు పంచ‌న ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మోచేతి నీరు తాగాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. ఇక‌, ప‌వ‌న్ నీడ అస్స‌లే అవ‌స‌రం లేదు. 2019 నాటికి మేం బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతాం. మాద‌గ్గ‌ర‌కే ఇత‌ర పార్టీలు రావాలి. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

పీకే గాలి తీసేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

రాజ‌కీయాల‌న్నాక చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక్క మెట్టు పొర‌పాటున దిగామా? వ‌ంద మెట్ల కింద‌కి తోసేసేందుకు అంతా కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, ఉత్త‌రాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఐఐటీయెన్ ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకే ప‌రిస్థితి ఇలానే ఉంది!! ఎన్నో ఆశ‌ల‌తో ఢిల్లీ నుంచి పీకేని దిగుమ‌తి చేసుకున్నాడు జ‌గ‌న్‌. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే ఏపీలో పాగా వేయాల‌ని దృఢంగా నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా త‌న‌ను, త‌న పార్టీని, నేత‌ల‌ను న‌డిపించేందుకు […]

కాకినాడ కార్పొరేష‌న్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది. నిన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్క‌డ కూడా గెల‌వ‌డంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాల‌కు ముగిసింది. మొత్తం మూడు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. 48 డివిజ‌న్లలోను టీడీపీ 32 డివిజ‌న్లు, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థులు 3 […]

కాకినాడ‌లో టీడీపీకి రెండు మైండ్ బ్లాక్ షాక్‌లు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించింది. నంద్యాల‌లో ఘ‌న‌విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ కాకినాడ‌లో కూడా సైకిల్ బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. వార్ వ‌న్‌సైడ్ చేసేసి విజ‌యం సాధించింది. ఇక్క‌డ మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన 9 సీట్ల‌లో స‌రిగా పెర్పామ్ చేయ‌లేక‌పోయింది. ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు మాల‌కొండ‌య్యే స్వ‌యంగా వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఇక్క‌డ టీడీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించినా ఆ పార్టీకి రెండు మైండ్ బ్లాక్ […]

కాకినాడ‌లో టీడీపీకి షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మాంచి జోష్‌లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకుంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో టీడీపీ+బీజేపీ కూట‌మి మెజార్టీ డివిజ‌న్లు కైవ‌సం చేసుకుని కార్పొరేష‌న్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇక్క‌డ టీడీపీకి అనుకూలంగా వార్ […]

మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై కొత్త ట్విస్ట్‌

స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ బీజేపీతో ఉంటుద‌ని కొంద‌రు, కాదు కాదు జ‌న‌సేన‌తో ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు ప్రచారం చేశారు. కిర‌ణ్ జ‌న‌సేన‌లోకి వెళితే ప‌వ‌న్ త‌న త‌ర్వాత పార్టీలో రెండో ప్లేస్ క‌ట్టబెడ‌తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే బీజేపీలో చేరాల‌ని కూడా కిర‌ణ్ భావించినా వెంక‌య్య ఆయ‌న బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నార‌ని కూడా అప్ప‌ట్లో […]

వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల‌కు కొత్త ట్విస్ట్‌

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విప‌క్ష వైసీపీని తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫ‌లితం ఎఫెక్ట్‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్ల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయ‌క‌త్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్ల‌లో […]