ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్కు ఓ సాధారణ కార్యకర్త చేతిలో అదిరిపోయే షాక్ తగిలింది. పంచాయతీ రాజ్ 40వ వార్షికోత్సవ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ సాధారణ కార్యకర్త వేసిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పలేక మరోసారి తడబాటుకు గురయ్యాడు.
ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చాలాసార్లు తడబాటుకు గురవుతోన్న లోకేశ్ ఈ సారి కార్యకర్త ప్రశ్నకే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త పార్టీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరగడంలేదంటూ లోకేశ్ ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై నాలుగుసార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కార్యకర్త తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తుండగా లోకేశ్ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేని లోకేశ్ నీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దని ఆ కార్యకర్తను హెచ్చరిస్తూ మాట్లాడారు. దీంతో అవాక్కవ్వడం అక్కడున్న వారి వంతు అయ్యింది. ఓ సాధారణ కార్యకర్త సాక్షాత్తు సీఎంను నాలుగు సార్లు కలిసినా న్యాయం జరగలేదని అంటే దానికి సరైన ఆన్సర్ ఇవ్వకుండా లోకేశ్ డంగైపోయాడని అక్కడున్న వారు చర్చించుకున్నారు.
ఏదేమైనా సాధారణ కార్యకర్త ప్రశ్నకే లోకేశ్ ఆన్సర్ చేయలేకపోయాడంటే ఇక బలమైన విపక్ష నాయకుల కౌంటర్లకు ఎలా రీ కౌంటర్లు ఇస్తాడన్న సందేహాలు కలుగుతున్నాయి.