టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఓ టైం లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఇటీవల కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో తిరిగి రాణించడం ప్రారంభించింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అలాగే ఇప్పుడు సత్యభామ టైటిల్ తో లేడీ ఓరియంటల్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ అమ్మడు మెప్పించనుంది. ఇక తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. అలాగే కాజల్ కూడా మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నాకు ఈ ముగ్గురు దర్శకులు అంటే చాలా స్పెషల్ అంటూ వివరించింది.
తన కెరీర్ ప్రారంభించేందుకు అవకాశం ఇచ్చిన తేజ అంటే ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. తేజ డైరెక్షన్లో కాజల్.. లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత సినిమాలో నటించింది. అలాగే రాజమౌళి తనకు మొదటిసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అని.. మగధీరతో బ్లాక్ బస్టర్ అందించారని ఆయన కూడా నాకు ఎంత స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక కమర్షియల్ గా తనకు గుర్తింపు వచ్చిన సినిమా చందమామ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ గారు ఇలా ఆ ముగ్గురు డైరెక్టర్ ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ అని కాజల్ వివరించింది.