ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన పూజా హెగ్డే గత కొంతకాలంగా రేసులో వెనుకబడిన సంగతి తెలిసిందే. వర్సెస్ ఫ్లాపులు ఎదురవడంతో.. ఈమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ అదృష్టాని పరిక్షించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా పూజాకు వర్కౌట్ కాలేదు. దీంతో దాదాపు ఏడాదిగా సినిమాలలో కనిపించని పూజా తాజాగా కాలివుడ్లో ఒక జాక్పాట్ అపర్ణ అందుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ సూర్యకు జంటగా ఓ సినిమాలో ఈమె నటించనుందట.
సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక సూర్య కెరీర్లో 44వ సినిమా గా రాబోతున్న ఈ సినిమాకు జూన్ ఫస్ట్ వీక్ నుంచి అండమాన్ దీవుల్లో షూటింగ్ ప్రారంభించనున్నారు. తర్వాత ఊటి, తమిళనాడులోని ఇతర ప్రదేశాల్లో 40 రోజుల లాంగ్ స్కేడ్యూలను ప్లాన్ చేశారట మేకర్స్. మళయాళ యాక్టర్ జోజు జార్జ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
సూర్యకు చెందిన 2D ఎంటర్టైన్మెంట్.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు చెందిన స్టోన్ బెంజ్ ఫిలిం సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఇక సంతోష్ నారాయణ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. విజయ్ బీస్ఠ్ తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న మరో కోలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. స్ట్రగుల్స్ లో ఉన్న పూజ హెగ్డేకు కెరీరట్కు ఇప్పుడు అందిన ఈ అవకాశం చాలా కీలకం. ఈ సినిమాతో బుట్టబొమ్మ హిట్ కొడితేనే ఆమె మళ్లీ త్రో బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే పూజా హేగ్ధే ఇండస్ట్రీకి దూరం అవాల్సి వస్తుందంటూ నెటింట కామెంట్లు వినిపిస్తున్నాయి.