తెలంగాణ పాలిటిక్స్‌లో పల్లవి ప్రశాంత్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన రైతు బిడ్డ..

సార్వ‌త్రిక ఎన్నికలకు మరికొద్ది రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేప‌ద్యంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యువ‌త‌ మేలుకోవాలి అంటూ సంచల కామెంట్స్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ 7 తెలుగు తో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి రైతుబిడ్డగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ షో కి రాకముందు పల్లవి ప్రశాంత్ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే తెలుసు. అయితే బిగ్ బాస్ లోకి వచ్చి తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని టైటిల్ కొల్లగొట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడు. పల్లవి ప్రశాంత్ హౌస్లో ఒదిగి ఉన్న విధానం నామినేషన్‌లో ఫైర్ అయ్యే విధానం.. టాస్కుల్లో వేగం.. ఫిజికల్ టాస్కుల్లో గెలవాలని చేస్తే శ్రమ.. ప్రేక్షకులను బాగా మెప్పించాయి.

ఇక ఆయన విజయంలో శివాజీ, ప్రిన్స్ యావర్‌ కూడా ఎంతో సపోర్టును అందించారు. ముఖ్యంగా శివాజీ.. ప్రశాంత్ కు గురువుగా వ్యవహరించాడు. ఇక పల్లవి ప్రశాంత్‌, యావర్, శివాజీ ముగ్గురు స్సై బ్యాచ్ గా పాపులర్ అయ్యారు. ఈ షో ముగిసిన తర్వాత కూడా వీరు ముగ్గురు కలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో శివాజీ, పల్లవి ప్రశాంత్ సందడి చేశారు. ఈ సందర్భంగా పల్ల‌వి ప్రశాంత్ మాట్లాడుతూ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన రైతుబిడ్డ.. మీ అందరూ సపోర్ట్ వల్ల బిగ్ బాస్ టైటిల్ గెలిచాన‌ని.. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇకపై జీవితంలో కూడా ఏదో ఒకటి సాధించి తీరుతానని వివరించాడు. పక్కనే ఉన్న శివాజీ మైక్ తీసుకుని తలుచుకుంటే వీడు పార్లమెంట్‌కి కూడా వెళ్ళిపోతాడు అంటూ కామెంట్ చేశాడు.

దానికి సమాధానం గా బిగ్ బాస్ షోలో లాగే.. రాజకీయాల్లో సపోర్ట్ చేస్తే పార్లమెంట్ కి వెళ్తా. యువత మేలుకోవాలి.. యువత ముందుకు రావాలి. అప్పుడే సమాజం బాగుంటుంది అంటూ పల్లవి ప్రశాంత్ కామెంట్ చేశాడు. ఇక పల్లవి ప్రశప్ చేసిన ఈ కామెంట్స్ ను బట్టి జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాలను రాణించాలని పల్లవి ప్రశాంత్‌ భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల త్వరలోనే జరుగును నేపథ్యంలో.. ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీకి మద్దతు ఇస్తాడు అనే చర్చ నెట్టింట వైరల్ గా మారింది. ఎటువంటి ఫాలోయింగ్ లేకపోయినా బర్రె లెక్క రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు.. భారీ క్రేజ్ ను సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంలో తప్పేముందంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.