ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేశాడు. మెగా అభిమానులకు ఈ సినిమా సంక్రాంతికి మంచి విందు ఇచ్చింది. మెగా అభిమానుల వరకు ఖైదీని బాగా ఎంజాయ్ చేస్తున్నా..సగటు సినీ అభిమానితో పాటు మేథావులు సైతం ఖైదీని చూసి పెదవి విరిచారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు పోటీగా వచ్చిన బాలయ్య శాతకర్ణి నందమూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు, విమర్శకులు ఇలా అందరిని మెప్పించింది.
ఇప్పుడు శాతకర్ణి సినిమా చూశాక చిరు డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇమేజ్ పక్కన పెట్టి, కథాబలం ఉన్న సినిమాలు చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఖైదీ నెంబర్ 150 తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ మాస్ మూవీ, తర్వాత సురేందర్రెడ్డి డైరెక్షన్లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అలాంటి రొటీన్ ప్రాజెక్టుల కంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వీరుడి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందన్న నిర్ణయానికి చిరు వచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య శాతకర్ణి సినిమా మాత్రం యావత్ తెలుగు జాతి మన్ననలను అందుకుంది. ప్రపంచం నలుమూలాలవున్న తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని చూసి మంచి సినిమా తీశారని ప్రసంశల జల్లు కురిపించారు.
ఈ క్రమంలోనే చిరు ఇప్పటికిప్పుడు ఇలాంటి కథాబలంతో పాటు తెలుగు జాతి గర్వించే సినిమా చేయాలన్న ఒత్తిళ్లు ఆయనపై వస్తున్నాయట. అందుకే డైలమాలో పడ్డ చిరు మనస్సు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తన 151వ సినిమాలో మాస్ జపం చేయాలనుకున్న చిరు కాస్త శాతకర్ణి దెబ్బకు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.