బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. జవాన్ విడుదల సందర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్తో కలిసి పాల్గొన్నారు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వారితో పాటు తిరుమల వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.
అయితే తిరుమలలో షారుఖ్ ధరించిన వాచ్ ఖరీదు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వైట్ కుర్తా-పైజామాను ధరించిన షారుఖ్.. తన చేతికి రోలెక్స్ GMT మాస్టర్ మెటోరైట్ వాచ్ ను పెట్టుకున్నారు. ఈ వాచ్ ధరతో ఓ ఇల్లు కొనేయొచ్చు. ఎందుకంటే, ఆ రోలెక్స్ వాచ్ ధర రూ. 51.23 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఒక్క వాచ్ కోసం అంత ఖర్చు పెట్టారా అంటూ చర్చించుకుంటున్నారు.
కాగా, షారుఖ్ ఖాన్-నయనతార జంటగా నటించిన `జవాన్` మూవీ నేడు విడుదల అయింది. రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. మొదట ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో షారుఖ్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశాడు. బాక్సాఫీస్ వద్ద జవాన్ విధ్వంసానికి సిద్ధం అవుతోంది.