టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే కనిపిస్తుంది . ఎందుకంటే ఆయనలో నెగిటివ్ అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లేదు . అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు మహేష్ బాబు. కాగా ప్రజెంట్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .
ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు ఎలాంటి సీన్స్ అయినా చిటికెలో చేస్తాడు. భారీ భారీ డైలాగులు కూడా చాలా సింపుల్ గా ఒక్క టేకులోనే చెప్పేస్తాడు . అయితే ఓ సినిమా విషయంలో మాత్రం ఓ చిన్న డైలాగ్ చెప్పడానికి ఏకంగా రెండు గంటల సమయం తీసుకున్నాడట . ఆ సినిమా మరేదో కాదు “భరత్ అనే నేను”. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భరత్ అనే నేను సినిమాను డైరెక్టర్ చేసింది కొరటాల శివ.
ఈ సినిమాలో భరత్ క్యారెక్టర్ పోషించిన మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది . ఆ టైంలో భరత్ అనే నేను అంటూ మహేష్ బాబు ప్రతిజ్ఞ స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ డైలాగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది . కానీ ఈ ఒక్క డైలాగ్ చెప్పడానికి మహేష్ బాబు ఏకంగా రెండు గంటలకు కష్టపడ్డారట. పొలిటీషియన్ స్టైల్ లో బేస్ వాయిస్ తో ఈ చిన్న డైలాగ్ చెప్పడానికి చాలా చాలా కష్టపడ్డారట . సినిమా మొత్తానికి ఆయన ఎక్కువగా టేక్స్ తీసుకున్నది కూడా ఈ డైలాగ్ కి అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!