మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఈ ఆగస్టు నెలలోనే పెళ్లి ముహుర్తం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ జంట చివరి వరకు కలిసి ఉంటుందా… లేక మధ్యలోనే విడిపోతుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు ప్రేమ వివాహాలు జరిగాయి. ముందుగా పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరోయిన్ రేణుదేశాయిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ చేసుకున్న ప్రేమ వివాహం పెద్ద దుమారం రేపింది. అయితే అభిప్రాయ భేదాల కారణంగా ఆ జంట కూడా విడిపోయింది.
ఇక స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అయితే ఈ రెండు జంటలు మాత్రమే ప్రస్తుతం కలిసున్నాయి. వీరిద్దరు చేసుకున్న అమ్మాయిలకు ఎలాంటి స్టార్ డమ్ లేదు. మరోవైపు మరో హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రెజీనాతో లవ్ బ్రేకప్ అయినట్లు పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. కానీ వీటికి అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు రెజీనా తరఫు నుంచి గాని ఎలాంటి ఖండన రాలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఏకమవుతుందన్న సమయంలో మెగా ఫ్యామిలీ ఓ విషయంపై టెన్షన్ పడుతోంది. అదేమిటంటే.. స్టార్ డమ్ ఉన్న వాళ్లు పెళ్లి చేసుకుంటే ఆ జంట విడిపోతుందనే టెన్షన్ మెగా ఫ్యామిలీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుమార్తె నిహారిక విడాకులు తీసుకోవడంతో… వరుణ్ జంట ఎలా ఉంటుందా అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినీ పరిశ్రమలో ఎన్నో జంటలు ప్రేమ వివాహం చేసుకుని సుఖంగా జీవిస్తున్నాయి.