సౌత్ స్టార్ బ్యూటీ సమంత `ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్` అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అందులో ఒకటి `ఖుషి`. ఇదొర రొమాంటిక్ ఎంటర్టైనర్. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే సమయంతో చేస్తున్న మరొక ప్రాజెక్ట్ `సిటాడెల్`.
ఇది అవుట్ అండ్ అవుట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హాలీవుడ్ `సిటాడెల్`కు ఇండియన్ వెర్షన్గా తెరకెక్కిస్తున్నారు. రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. అయితే నేడు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయిందని సమంత ఎంతో హుషారుగా పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది.
జూలై 13 తన జీవితంలో అత్యంత స్పెషల్ అని.. ఈరోజున సిటాడెల్ వెబ్ సిరీస్ కంప్లీట్ అయిందని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ స్లైలిష్ సెల్ఫీని కూడా పంచుకుంది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఓవైపు ఖుషి, మరోవైపు సిటాడెల్ ను కంప్లీట్ చేసిన సమంత.. ఇప్పుడు ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్లబోతోంది. కొద్ది నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే సమంత ఇటువంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది.