అది పూర్తి అయ్యాకే మోక్షజ్ఞ ఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గ‌త కొన్నేళ్ల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు త‌ప్పితే.. మోక్షజ్ఞ డెబ్యూ మాత్రం ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై కొంద‌రు ఆశ‌లు కూడా వ‌దులుకున్నాయి.

అయితే ఒకప్పుడు లావుగా అసలు హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న మోక్షజ్ఞ.. ఇటీవ‌ల స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా మారిపోయాడు. దీంతో అంద‌రిలోనూ కొత్త ఆశ‌లు మొల‌కెత్తాయి. మోక్షజ్ఞ ఎంట్రీ త్వ‌ర‌లో ఉండ‌టం ఖాయ‌మ‌ని చాలా మంది న‌మ్మారు. ఇక ఇదే విష‌యంపై బాల‌య్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన‌ బాల‌య్య‌.. అక్క‌డ అభిమానుల‌తో త‌న‌యుడి ఎంట్రీపై ప్ర‌స్తావించార‌ట‌.

మొదటి నుంచి కూడా బాలయ్య ఆదిత్య 369 కి సీక్వెల్ `ఆదిత్య 999` సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడ‌ని చెప్పుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఆయ‌న అదే మాట మీద ఉన్నార‌ట‌. అయితే ఇందులో బాల‌య్య‌, మోక్షజ్ఞ.. ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తార‌ట‌. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పూర్తి అయ్యాకే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంద‌ని ఆయ‌న చెప్పార‌ట‌. అంటే వ‌చ్చే ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు.