ప్రభాస్- డైరెక్టర్ మారుతి చిత్రం ఆగిపోవడానికి.. కారణం అదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా బాహుబలి-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గా మిగిలాయి.ఇటీవల విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ కలెక్షన్ల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

Prabhas' Film With Maruthi Leaked Details Rubbished, Director Says "Please  Refrain From Any Rumours About..."

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో project -k , స్పిరిట్ ,డైరెక్టర్ మారుతీతో రాజా డీలక్స్ వంటి సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మారుతి సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డైరెక్టర్ మారుతి వంటి దర్శకులతో ప్రయోగం చేయలేనంటు ప్రభాస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ ను పక్కనపెట్టి మరి ఈ చిత్రాన్ని ఆపే పనిలో ప్రభాస్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సలార్ ,ప్రాజెక్ట్-k చిత్రాలు హిట్ అయితే తప్పకుండా డైరెక్టర్ మారుతీ తో సినిమా మొదలుపెట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ సినిమా లేనట్లే అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమేరకు ఈ సినిమా షూటింగ్ జరిగింది.. కనుక వాయిదా వేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటు నిర్మాత దానయ్య తెలియజేసినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమా ఇలా అర్ధాంతరంగా ఆపివేయడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఇందులో విలన్ గా సంజయ్ దత్ కూడా కనిపించబోతున్నారు. మరి చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో ఈ విషయం పైన చూడాలి మరి.