ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తాము తీసుకొని రెమ్యూనరేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కో చిత్రానికి స్టార్ హీరోలు సైతం దాదాపుగా రూ 80 నుంచి రూ.100 కోట్ల రూపాయల లోపు తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు సైతం మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే నిన్నటి రోజున రజనీకాంత్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ వేడుకకు గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ తీసుకుని రేమ్యునరేషన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
తన జీవితంలో ఎన్టీఆర్ తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారని రజనీకాంత్ తెలిపారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని రాజకీయాలలో వచ్చేనాటికి ఎన్టీఆర్ పారితోషకం సుమారుగా రూ.10 లక్షల రూపాయలు ఉందని 42 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వంటి ఇప్పుడు ఎన్ని కోట్లు అవన్నీ వదిలేసి కేవలం ప్రజల కోసమే రాజకీయాలలోకి వచ్చారని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రమంతట తిరిగారని.. తెలుగువారు పాలించాల ఢిల్లీ పాలించాల అని ఒకే ఒక ప్రశ్న వేశారు ఫుడ్ పాత్ మీద నిద్రపోయారు.పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలలలోనే పెను సంచలనాన్ని సృష్టించారు ఆయన యొక్క యుగ పురుషుడు అంటూ తెలిపారు రజనీకాంత్.
తన జీవితంలో తాను తనకు తెలియకుండా రెండుసార్లు ఎగిరి గంతేసానని అందులో మొదటిసారి 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు రెండోసారి హిమాలయాలకు వెళ్లి గంగానదిని చూసినప్పుడు అని తెలిపారు. అప్పటివరకు సినిమాలలోని చూసిన ఎన్టీఆర్ను తాను మొదటిసారి 1963 లో నిజంగా చూశానని తెలిపారు.