ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు.
తాను ఒంటరిగా పోరాడుతున్నానని, తోడేళ్ళ గుంపులు ఏకమవుతున్నాయని, తాను పేదల మనిషి అని, తనకు ప్రజలే అండగా ఉండాలని, వారితోనే తన పొత్తు అని చెబుతున్నారు. అంటే ఇలా పదే పదే చెప్పడం వల్ల జగన్ నిజంగానే ఒంటరిగా పాపం పోరాడుతున్నారని, ఆయనపై కుట్రలు చేస్తున్నారని ప్రజలు అనుకోవాలనే విధంగా పరిస్తితి ఉంది. అలా ఉంటే సానుభూతితో మళ్ళీ ప్రజలు అండగా ఉంటారని అనుకుంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు పడే పడే కష్టాలు తెలిసిందే. ఏదో పథకాలు కొంతమేర వస్తున్నాయి గాని..పెరిగిన పన్నులు ప్రజలపై ఆర్ధిక భారం పెంచుతున్నాయి. ఆ బాధలు ప్రజలు పడుతున్నారు. అందుకే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి చంద్రబాబు, పవన్ ఏకమవుతున్నారు.
ఇక జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదనే చెప్పాలి. అలాగే పదే పదే పేద సిఎం అని చెప్పడం వల్ల ప్రజలు నమ్మడం కష్టం. అటు తనకు మీడియా లేదని చెప్పి టిడిపి అనుకూల మీడియాపై విమర్శలు చేస్తున్నారు. అయితే సాక్షి పేపర్, టీవీ..ఇంకా వైసీపీ అనుకూల మీడియా ఏవేవీ ఉన్నాయో ప్రజలకు తెలుసు. అవన్నీ తెలిసి కూడా జగన్ సెంటిమెంట్ పండదని చెప్పాలి.