ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల లో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని హీరోగా విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా తాను స్వయంగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేద పేతురాజు నటించింది. ఈ సినిమా గత నెల 22వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రిమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ ఓటీటి సమస్థ ఆయన ఆహ సంస్ధ ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి స్ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ఆహా సంస్థ ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా విశ్వక్ సేన్ బ్యానర్ పైన కరాటే రాజు నిర్మించడం జరిగింది. ఇందులో రంగస్థలం నటుడు మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఇందులో విశ్వక్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.
కేవలం ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే ఈ సినిమా పెట్టుబడులను రాబట్టి కలెక్షన్ల పరంగా మంచి లాభాలను అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఓటీటి లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం విశ్వక్ తన తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే వెలుబడింది.