ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్గా నటించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. మిక్స్ టాక్ లభించినప్పటికీ.. పండుగ అడ్వాంటేజ్ తో తమిళంలో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. తెలుగులో పర్వాలేదనిపించుకుంది.
ఇకపోతే అజిత్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. నెల తిరక్క ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెగింపు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఫిబ్రవరి 8 నుంచి ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ముహూర్తం పెట్టారు. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.