దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటగాను సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీమ్ మొత్తం సంతోషంలో ఉప్పొంగిపోయింది. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల అందరూ త్రిబుల్ ఆర్ చిత్ర యూనట్కు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సినిమాకు ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో.. ఈ సినిమాలో కొమరం భీముడుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు థాంక్స్ చెప్తూ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు అమెరికాలో త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో కూడా రెండు విభాగాల్లో నామినేట్ అయింది. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి గారికి అవార్డు లభించింది. మా సంగీత దర్శకుడు కీరవాణి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాను.
ఈ సినిమా అమెరికాతో పాటు జపాన్లో కూడా ఎంతో గొప్ప ప్రజాధరణ దక్కించుకుంది అంటే అభిమానుల దీవెన వల్లే. ఈ సినిమా దర్శకుడైన రాజమౌళి కష్టం కూడా ఎంతో ఉంది. ఒక భారతీయ సినిమాగా ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ప్రజాధరణ లభించింది. ఇందుకు నేను అభిమానులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కీరవాణి గారు మన భారతీయ సినిమా పరిశ్రమకు ఎంతో గొప్ప అద్భుతమైన సంగీతం అందించారు. నేను నటించిన సినిమాలు కూడా వారు ఎంతో గొప్ప సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.