టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయసుధ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించింది. తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్- ఏఎన్ఆర్ తో కూడా ఈమె సినిమాల్లో నటించి సహజ నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఆ తర్వాత తరం హీరోలుగా వచ్చిన బాలకృష్ణ, చిరంజీవితో కూడా నటించింది. ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ సినిమా పరిశ్రమంలో కొనసాగుతుంది.
అయితే ఇప్పుడు జయసుధ మూడో పెళ్లి చేసుకుందా..? అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017లో మరణించిన విషయంం తెలిసిందే. తన ఫ్యామిలీలో కొన్ని అనుకోని కారణాలవల్ల సూసైడ్ చేసుకుని మరణించాడు నితిన్ కపూర్. అప్పటి నుంచి ఈమె తన కొడుకుతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలోనే గత సంవత్సరం జయసుధ కొన్ని అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంది. తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా వచ్చింది.
ఈ సమయంలోనే అక్కడ వైద్యం తీసుకుంటున్న సమయంలోనే జయసుధ అసలు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది.. ఇప్పుడిప్పుడే తన పాత రూపానికి వస్తుంది. గత కొన్ని రోజుల క్రితం ఈమె ఒక వ్యాపారవేత్తను మూడో వివాహం చేసిందని వార్తలు బయటకు వచ్చాయి. ఏ ఫంక్షన్కు గాని ఏ ఈవెంట్ కు వెళ్లిన జయసుధ అతనితో కలిసి కనిపిస్తుంది. ఇక దీంతో ఈమె పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ కూతురు పెళ్లిలో కూడా జయసుధ ఆతినితో కలిసి సందడి చేసింది. తాజాగా మొన్న వారిసు ఈవెంట్ లో కూడా జయసుధ అతనితో కలిసి కనిపించింది.
దీంతో ఇప్పుడు ఈ జంట ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నిజం అనిపిస్తున్నాయి. జయసుధ ముందుగా కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. తర్వాత మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయినా జితేంద్ర కపూర్ బ్రదర్ అయిన నితిన్ కపూర్ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతను మరణించిన తర్వాత మరో బిజినెస్ మాన్ను మూడో పెళ్లి చేసుకుందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది.