త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్లో ఈయనా ఒకరు. రచయితగా కెరీర్ను ప్రారంభించిన త్రివిక్రమ్..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం తనకే సొంతమని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయన.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ లవ్ ఎఫైర్కు సంబంధించిన ఓ వార్త ఒకప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పార్వతీ మెల్టన్తో త్రివిక్రమ్ ఎఫైర్ నడిపించాడని ఒకప్పుడు పుకార్లు తెగ షికార్లు కొట్టాయి.
అంతేకాదు, జల్సా సినిమా సమయంలో పార్వతీకి త్రివిక్రమ్ ఖరీదైన డైమండ్ నెక్లెస్ను కూడా గిఫ్ట్గా ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పార్వతీ మాత్రం టాలీవుడ్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం వెండితెరకు దూరమైన పార్వతీ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికా సెటిల్ అయింది.