టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తే, తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్న నితిన్.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్టర్ను ఎంచుకున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈయన అఖిల్తో `ఏజెంట్` మూవీతో చేస్తున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి పవన్తో ఈ మూవీ చేయాల్సి ఉంది.
కానీ, పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయనతో సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ను సైడ్ చేసేసి.. ఏజెంట్ తర్వాత నితిన్తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి నయా ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇటీవల ఓ కథ రెడీ చేసి నితిన్కి వినిపించగా అది ఆయనకు బాగా నచ్చి సినిమా చేసేందుకు సిగ్నెల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.