టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
`పుష్ప- ది రైజ్’ అనే టైటిల్తో రాబోతోన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ చాలా వరకు మారేడుమిల్లి అడవుల్లోనే జరగగా.. ఇప్పుడు పుష్ప టీమ్ మరోసారి అక్కడికే పయణమయ్యారు. సుకుమార్తో పాటు బన్నీ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరేడుమిల్లి షెడ్యూల్తో పుష్ప మొదటి భాగం షూటింగ్ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు.
ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే ముగించి అక్టోబర్ లో సినిమాకు గుమ్మడి కాయ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.