ఆ సినిమా కంటే కార్తీ మద్రాస్ సినిమా ముందు వస్తుందా..?

మద్రాస్ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగువారు విడిపోయినప్పటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఈలోగానే కార్తీ నటించిన మద్రాస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

నిజానికి ఈ సినిమా 2014లో తమిళంలో విడుదల అయ్యింది. అంతే కాకుండా మద్రాస్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాని నిర్మించింది.కె ఈ జ్ఞానవేల్ రాజా కమర్షియల్ గా విజయం అందుకున్నారు.ఇక ఈ సినిమాని తెలుగులో అనువదించడానికి అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయి.

ఇప్పుడు వచ్చే సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అంటున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను, విషయాలను త్వరలోనే దర్శక నిర్మాతలు చెప్పుతా మంటున్నారు. ఈ చిత్రానికి పా రంజిత్ స్క్రీన్ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తీ, కలై రసన్,హరికృష్ణ, రిత్విక తదితరులు ఈ సినిమాలో నటించారు. కార్తీ సినిమాలు మనం ఎన్నో చూసాము. తను నటించబోతున్న ఏ సినిమా అయినా కొంచెం త్రిల్లింగ్ మూవీలుగా అనిపిస్తుంటాయి. ఈ మద్రాస్ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.