నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్ మధ్యన సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్ను ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ అనే యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన గుర్తిండే ఉంటుంది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటన మొన్నా మధ్య తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో చివరకు ప్రియదర్శనిదే తప్పని తేలడంతో.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. కొందరు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రియదర్శని మరోసారి వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అప్పుడు సాదత్ చెంప చెల్లుమనిపించిన ప్రియదర్శిని.. నిన్న రక్షాబంధన్ సందర్భంగా అతడికి రాఖీ కట్టేసింది.
ఇందుకోసం ఆమె తమ ఇంటిని అందంగా అలంకరించి, ప్రత్యేకమైన స్వీట్లు కొనుగోలు చేసి, ఆ డ్రైవర్కు సాదరంగా ఆహ్వానం పలికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి..నాడు అతనితో జరిగిన గొడవ పూర్తిగా సమసిపోయేలా చేసింది. దాంతో ఇప్పుడీ ఈ విషయం నెట్టింట వైరల్గా మారింది.
https://twitter.com/SwatiJaiHind/status/1422125265421963266?s=20