టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది.
అయితే ఇంతలోనే సుకుమార్తో సహా మొత్తం సెట్లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, రష్మికలు మాత్రం డెంగ్యూ నుంచి తప్పించుకున్నారని వారి అభిమానులు కాస్త సంతోషపడ్డారు. కానీ, వీరిద్దరినీ కూడా డెంగ్యూ వదల్లేదు.
తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్, రష్మికలకు డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరికి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని, ప్రస్తుతం వీరు ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.