రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు.
కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో ప్రశాంత్ మార్పుల చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ సినిమాలో ఓ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ని యాడ్ చేశారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, త్వరలోనే ఓ ప్రత్యేకమైన సెట్లో ఈ ఫాష్ బ్యాక్ ఎపిసోడ్ను చిత్రీకరించనున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, ప్రభాస్ సలార్తో పాటు ఆదిపురుష్, రాధేశ్యామ్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ సెట్స్పైనే ఉన్నాయి.