ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది.
వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భామ నారప్పతో ప్రేక్షకులను పలకరించనుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం జూలై 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. అనేక విషయాలు పంచుకుంది.
ఈ క్రమంలోనే తన మనసులో ఉన్న కోరికను కూడా బయట పెట్టింది. ప్రియమణి మాట్లాడుతూ.. సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణలతో చేశాను. చిరంజీవిగారితో, వెంకటేష్ గారితో చేయాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. అయితే నారప్ప తో వెంకటేశ్గారితో నటించే అవకాశం దక్కింది. వెంకీగారితో కలిసి నటించినందుకు చాలా హ్యాపీ. ఇక ఇప్పుడు చిరంజీవి గారితో కలసి వర్క్ చేయడంమే నా అతి పెద్ద కోరిక అని చెప్పుకొచ్చింది. మరి ప్రియమణి కోరిక నెరవేరుతుందో.. లేదో..చూడాలి.