మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆకట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సెకెండ్ సింగిల్ విడుదలకు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఆచార్య సెకండ్ సాంగ్ ఈ నెలలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో త్వరలోనే తెలియనుంది. కాగా, షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.