పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ షూటింగ్ను చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుదల కాకముందే.. మరో డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వార్ వంటి యాక్షన్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇటీవల ప్రభాస్కు ఓ కథ చెప్పగా.. అది ఆయనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పాడట.
దీంతో సిద్ధార్థ్ ఆనంద్ స్క్రిప్ట్ను పూర్తి చేసే పనిలో పడ్డాడట. అయితే ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. కత్రినా మంచి పొడగరి కనుక .. ప్రభాస్కు సరసన ఆమెనే బాగా సెట్ అవుతుందని సిద్ధార్థ్ ఆనంద్ భావిస్తున్నాడట. అందుకే కత్రినాతో సంప్రదింపులు జరపగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని అంటున్నారు.