కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధప్రాతిపదిక ఆక్సిజన్ తరలింపునకు చర్యలు చేపడుతున్నారు.
అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీలక నిర్ణయం తీసుకున్నది. యుద్ధ విమానాల్లో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ను తరలిస్తున్నది. తాజాగా బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఒరిస్సా కి ఆక్సిజన్ టాంక్ లను పంపించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ దగ్గర ఉండి మరీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఆ రాష్ట్రానికి పంపించారు. దేశం లోనే మొదటి సరిగా ఈ ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ సైతం ట్విట్ చేశారు. మంత్రికి, అధికారులకు అభినందనలు తెలిపారు.