రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్..ఇందులో నిజమెంతంటే..?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు.

బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను గుర్తించేలా ఒక పరికరాన్ని తయారు చేశారు చెన్నై కీజపక్కంలోనీ కేజే ఆసుపత్రి పరిశోధకులు. కేజే కోవిడ్ ట్రాకర్ పేరుతో పిలిచే ఈ డివైజ్ ఒక చేయిలాగా ఉంటుంది. ఈ డివైజ్ సాయంతో బీపీ, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్త కణాల సంఖ్యతో బాటు జీటా పోటెన్షియల్ స్థాయిలు కూడా తెలుస్తాయి. ఆర్ టీ పీసీఆర్ కంటే పక్కాగా రిజల్ట్ ఇస్తుందని ఆ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు.