వైరల్ : అక్కడ వింత శిశువు జ‌న‌నం..!?

ఒడిశాలో మ‌రో వింత శిశువు జ‌న్మించింది. ఒక మ‌హిళ‌ పంది త‌ల‌ను పోలిన త‌ల‌, చేప చ‌ర్మాన్ని పోలిన చ‌ర్మంతో ఉన్న‌ వింత శిశువుకు జ‌న్మ‌ ఇచ్చింది. ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెర్హంపూర్‌లోని ఓ ఆస్ప‌త్రిలో గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.బెర్హంపూర్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని బ‌ట్ట‌కుమార గ్రామానికి చెందిన ఓ 30 ఏండ్ల‌ మ‌హిళ 8 నెల‌ల గ‌ర్భిణి. అయితే గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావ‌డంతో బెర్హంపూర్‌లోని మెడిక‌ల్ కాలేజ్ అండ్ ఆస్ప‌త్రికి ఆమెను తీసుకెళ్లారు.

అక్క‌డ గ‌ర్భిణి ప‌రిస్థితిని ప‌రీక్షించిన వైద్యులు నెల‌లు నిండ‌క‌పోయినా సిజేరియ‌న్ చేసి శిశువును బ‌య‌టికి తీశారు. అయితే 2.40 కిలోల బరువున్న ఆ శిశువు ఆకారాన్ని చూసి అందరు షాక‌య్యారు. పంది త‌ల‌ను పోలిన త‌ల‌, చేప చ‌ర్మాన్ని పోలిన చ‌ర్మంతో శిశువు జ‌న్మించ‌డం చాలా అరుద‌ని బెర్హంపూర్ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా అన్నారు. ఇలా శిశువు జ‌న్మించ‌డాన్ని హ‌ర్లేక్విన్ ఇక్థియోసిస్ అనే రుగ్మ‌త కార‌ణంగా ఇలా వింత శిశువులు జ‌న్మిస్తుంటార‌ని ఆయ‌న చెప్పారు.