అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం ఒక కొత్త యాడ్ చేశారు. అందులో ఆయన చెల్లెలిగా రెజీనా నటించారు. కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గానే కాక ప్రమోటర్గా కూడా ఉన్నారు.
తన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన చెల్లెలు అత్తారింటికి వెళ్లిపోతోందే అని కలత చెందే అన్నయ్యగా కింగ్ నాగార్జున నటించారు. బాధపడవద్దు అన్నయ్య, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లెలిగా నటి రెజీనా కనిపించారు. ఈ ప్రకటన బ్యాగ్రౌండ్లో చెల్లీ, సిరిమల్లి నా చెల్లి సిరిమల్లి. ఓ గుండెలమీద పెరిగావులే, బతకాలి నీవు మహారాణివలే అంటూ ఓ ఎమోషనల్ పాట కూడా పెట్టారు. తాజాగా రూపొందించిన ఈ ప్రకటనలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ కూడా కనిపిస్తారు.