RC 16లో ఆ స్టార్ హీరో భార్య.. బుచ్చిబాబు మాస్టర్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక గతేడాది నవంబర్లో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ నవంబర్‌లో మైసూర్‌లో పూర్తయింది. ఇటీవల టీం సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాదులో ఫినిష్ చేశారు.

RC 16: Makers of Ram Charan-Buchi Babu Sana film welcome Shivarajkumar  onboard | Check out first-look poster here

మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకుని రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక మూవీ అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్న‌ ఈ సినిమా.. భారీ లెవెల్ హైటెక్నికల్ వాల్యూస్‌తో అసలు ఎక్కడ తగ్గకుండా రూపొందిస్తున్నారు టీం. ఈ క్రమంలోనే సినిమాలో భారీ తారాగ‌ణం నటించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఏమన్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ రోల్‌లో మెరువనున్నారు. ఇటీవల మూవీ టీమ్ శివ‌న్న లుక్స్ టెస్ట్ పూర్తి చేశారు.

"Forever And Always," Writes Meghana Raj On Chiranjeevi Sarja's Birth  Anniversary. Pic Inside

త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పాల్గొననున్నాడు శివన్న. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. అదేంటంటే ఈ సినిమాల్లో మరో కన్నడ దివంగత నటుడు.. స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య కూడా కీలకపాత్రలో నటించ‌నున్న‌ట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే మేకర్స్ రివీల్‌ చేయనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ కెమెరామ్యాన్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాను వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమా కోసం మైత్రి మేకర్స్ ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.