సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫాన్స్ కు షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత ఫోటోలు వైరల్..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సెలబ్రిటీస్ పెళ్ళి బంధంతో ఒకటయ్యారు. హీరోయిన్లు, హీరోలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు. ఇక గ‌తేడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోకి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ యాక్టర్ జాకీ బాగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది. అలాగే టాలీవుడ్ హీరో అర్జున్ పెద్దకూతురు ఐశ్వర్య కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అక్షరాపార్ధశాన్ని ఇటీవలే తాజాగా వివాహం చేసుకుంది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొడుకు హీరో ఆశిష్‌ కూడా ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకొంది తంవ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతుంది. ఇక మరో హీరోయిన్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. మొంబాయి బ్యూటీ హీరోయిన్ నటాషా దోషి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. బాలయ్య నటించిన జై సింహా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ నటించిన కోతలరాముడు, కళ్యాణ్‌రామ్ నటించిన ఎంతమంచివాడవురా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ గతేడాది బిజినెస్ మ్యాన్ మనోజ్ షా తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. జనవరి 31న వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం చాలామందికి తెలియదు. పెళ్ళైన నెల రోజుల తర్వాత తాజాగా వీరు పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అయితే పెళ్లి ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మాత్రం ఈమె క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.