టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా దివీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీ పాపులారిటీతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలుతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.
ఇందులో భాగంగా తాను చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జోర్దార్ సుజాత హోసంట్ గా ఉన్న ఒక టాక్ షోలో దివి తన ఎమోషనల్ లవ్ స్టోరీని వివరించింది. బీటెక్ చదివే రోజుల్లో ఒక్క అతని ప్రేమించా.. ఎంటెక్ వరకు కూడా మేము ప్రేమించుకుంటూనే ఉన్నాం. తర్వాత వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబాలను కూడా ఒపించాము. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. కానీ సడన్గా మా పెళ్లి సమయానికి ఆ అబ్బాయి తమ్ముడు చనిపోయాడు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.
అలాగే అతను హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం అతను వెళ్ళిపోయాడు. అతని కోసం నేను కూడా వాళ్ళ గ్రామానికి వెళ్తే నాకు కెరీర్ స్పాయిల్ అయిపోతుందని నన్ను దూరం పెట్టాడు. అయితే నాకు బ్రేకప్ చెప్పినది కేవలం ఆ కారణంతోనే అని నాకు మొదట తెలియదు. దీంతో ఇద్దరం విడిపోయాం. నా కెరీర్ కోసం బ్రేకప్ చెప్పాడు అని తెలిస్తే నేను కచ్చితంగా అతని కోసం ఊరు వెళ్ళిపోయే దాన్ని అంటూ దివి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ దివి రివీల్ చేసిన తన లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.