ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ర‌గ‌బోతున్న వ‌రుణ్-లావ‌ణ్య రిసెప్ష‌న్‌.. ఈసారి ఎక్కడో తెలుసా?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. కొద్ది రోజుల క్రిత‌మే ఏడ‌డుగులు బంధంతో ఒక‌ట‌య్యారు. ఇట‌లీలోని టస్కానీలో న‌వంబ‌ర్ 1న‌ వీరి వివాహం అంగ‌రంగ రంగ వైభవంగా జ‌రిగింది. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా ఈ వేడుక‌లో సంద‌డి చేశారు.

పెళ్లి జ‌రిగిన త‌ర్వాత ఇట‌లీలోనే సింపుల్ గా ఒక చిన్న రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. అక్క‌డ నుంచి వ‌చ్చాక న‌వంబ‌ర్ 5వ తేదీన హైద‌రాబాద్ లో మ‌ళ్లీ గ్రాండ్ గా రిసెప్ష‌న్ ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ విచ్చేసి.. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌రుణ్-లావ‌ణ్య రిసెప్ష‌న్ జ‌ర‌గ‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అది కూడా ఇక్క‌డ కాదు.. డెహ్రాడూన్‌లో. లావ‌ణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జ‌న్మించిన‌ప్ప‌టికీ.. ఆమె ఫ్యామిలీ డెహ్రాడూన్ స్థిర‌పడ్డారు. లావ‌న్య డెహ్రాడూన్‌లోనే పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే లావణ్య త్రిపాఠి ఇంటి వద్ద వాళ్ళ బంధువుల స‌మ‌క్షంలో మ‌రోసారి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి, నిహారిక, నాగ‌బాబు, ప‌ద్మ‌జ‌తో స‌హా ప‌లువురు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ డెహ్రాడూన్ కి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో నెట్టింట వైర‌ల్ అవుతున్న వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లైంది.