హీరోల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి..!!

ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. లేడి పవర్ స్టార్ అనే ట్యాగ్ను కూడా అందుకోవడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. తనకు పాత్ర కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఒకటి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ఒక చిత్రం హిందీలో రామాయన్ అనే సినిమాలో నటిస్తున్నట్లు అలాగే నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం హీరోయిన్లకు కూడా దీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటోందట ఈ ముద్దుగుమ్మ .పాత్రను బట్టి హీరోయిన్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. తండేల్ సినిమా కోసం సాయి పల్లవి దాదాపుగా 3 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి సాయి పల్లవి అడిగినంత నిర్మాతలు ఇస్తారా.. అనే విషయంపై అభిమానులు ఆమె మార్కెట్ అలాంటిది అనే విధంగా అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి సాయి పల్లవి.