యానిమల్ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తగ్గించేసిన రణబీర్.. ఎన్ని కొట్లంటే..?

రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్..ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని భారీగానే తగ్గించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.

అందుకు గల కారణం ఏమిటంటే ఇటీవల తను నటించిన కొన్ని సినిమాలు ఘోరంగా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో తన తదుపరి చిత్రానికి రెమ్యూనరేషన్ ఇంతలా తగ్గించాలని వార్తలు వినిపిస్తున్నాయి. 2002లో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం షంషేరా సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యిందని ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి నిర్మించారు. ఇందులో సంజయ్ దత వాణి కపూర్ కూడా నటించారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల లాస్ వచ్చినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రావడం జరిగింది. ఈ సినిమా 400 కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది కానీ అత్యధిక బడ్జెట్ కారణంగా ఈ సినిమా క్లిక్ కాలేదు.. ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ జోనర్ల తూజాటి మై మక్కర్ అనే చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయగా దీంతో 200 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో రణబీర్ ఏకంగా తన రెమ్యూనరేషన్లు 50 శాతాన్ని వరకు తగ్గించినట్లు సమాచారం. అలా 70 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయల వరకు తగ్గిపోయినట్లు సమాచారం.