జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంచ్ ప్రసాద్….ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన కార్యక్రమం జబర్దస్త్. ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది ఈ కార్యక్రమం. మన తెలుగు చిత్ర పరిశ్రమకు కమెడియన్ల కొరత లేకుండా చేసింది ఈ షో. జబర్దస్త్ కంటెస్టెంట్ లలో చాలామంది సినీ పరిశ్రమలో నటులుగా స్థిరపడితే, రాకింగ్ రాకేష్, వేణు వంటివారు దర్శకులుగా కూడా మారారు. తెలుగు ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్ లలో ఒకడు పంచ్ ప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగులతో నవ్వులు పుట్టిస్తూ ఉంటాడు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ షో లో పంచ్ డైలాగులకు కేర్ అఫ్ అడ్రస్ గా మరి, తనకున్న టాలెంట్ నే ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు ఈ కుర్రోడు.

అసలు విషయం ఏమిటంటే, ప్రసాద్ కు ఆరోగ్య సమస్యలు ఉన్న విషయం చాలామందికి తెలుసు. అతడు ఎంతో కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతని రెండు కిడ్నీలు పాడయ్యాయని సమాచారం. ఈ కారణంగానే గతంలో రెండు మార్లు జబర్దస్త్ కు దూరమయ్యాడు. ప్రసాద్ జబర్దస్త్ తోపాటు “శ్రీదేవి డ్రామా కంపెనీ” కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఈ షో కి కూడా ప్రస్తుతం ఆయన దూరంగా ఉన్నారు. ఈ మధ్యే మళ్ళీ అనారోగ్యం పాలవ్వడంతో, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించున్నారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఆయన మళ్ళీ బుల్లితెర పై ఇప్పట్లో కనిపించడం కష్టమే అనుకున్నారు ప్రేక్షకులు.

కానీ ఈ మధ్య అనూహ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రత్యక్షమయ్యారు. ఆపరేషన్ జరిగి రెండు నెలలు పూర్తి కాకముందే ఆయన ఇలా మళ్ళీ టీవీ లో ప్రత్యక్షమవ్వడం ఫాన్స్ కు సంతోషం కలిగించే విషయమే ఐనప్పటికీ, ఆయన ఆరోగ్యం పరంగా కాస్త జాగ్రత్త తీసుకోమంటున్నారు అభిమానులు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తన బాధలను, అనుభవాలను అందరితోనూ పంచుకున్నారు. తరువాత తనదయిన స్టైల్ లో పంచ్ డైలాగులతో రెచ్చిపోయారు. హైపర్ ఆదితో కలిసి షోలో నవ్వులు పండించారు.