ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఫైనల్ గా మెగా ఇంటికి కోడలైపోయింది. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడింది. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సందడి చేశారు.
నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరిగింది. టాలీవుడ్ సినీ తారలందరూ ఈ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులకు విషెస్ చెప్పి ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి రిసెప్షన్ శారీ ధర హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిలో రూ. 10 లక్షలు విలువ చేసే పట్టుచీర కట్టుకుని వార్తల్లో నిలిచిన మెగా కోడలు.. రిసెప్షన్ ఫంక్షన్ లోనూ తగ్గేదేలే అనిపించుకుంది.
గోల్డ్ కలర్ తళుకుల చీరలో మెరుపులు మెరిపించింది. లావణ్య త్రిపాఠి చీరను సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ చీర విలువ అక్షరాల రూ. 2.75 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. మెగా కోడలా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, గతంలో ఇదే చీరను షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో కట్టుకుంది.