శ్రీకాంత్ అడ్డాల-అనసూయ మధ్య విభేదాలా..హాట్ కామెంట్స్ చేసిన అనసూయ..!!

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ వెంటనే మహేష్ వెంకటేష్ తో కలసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని తెరకెక్కించి మరింత పాపులారిటీ అందుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాతో ఈయన ఇమేజ్నంత డామేజ్ చేసుకున్నారు. ఇటీవల పేద కాపు-1 సినిమాని విడుదల చేసి ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. ట్రైలర్ పర్వాలేదు అనుకున్నప్పటికీ మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ తో నిలిచింది దాదాపుగా 10 కోట్లకు పైగా ఈ సినిమా నష్టాలను మిగిల్చింది.

ఇందులో అనసూయ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ఆమె కెరియర్ కు ప్లస్ అవుతుందనుకోగా కానీ ఫలితం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు.. తాజాగా అనసూయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పేద కాపు సినిమా ఫెయిల్యూర్ పైన స్పందించింది.. పేద కాపు పూర్తిగా శ్రీకాంత్ అడ్డాల మార్కని అందులో కొన్ని విషయాలు మన అంచనాలు అందకుండా ఉన్నాయని.. బహుశా అతని విజయం తనకి అర్థం కాలేదు అనుకుంటా అలాగే ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదేమో అందుకే ఈ సినిమాని పెద్దగా ఎవరు ఇష్టపడలేదని తెలిపారు. కానీ డైరెక్టర్ తాను అనుకున్న విషయాన్ని సాధించారని తెలిపింది అనసూయ.

Team Anasuya ♥ (@Anasuyakhasba) / X
పేద కాపు సినిమాలో తనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కట్ చేశారని ఈ విషయాన్ని తెలియజేసింది.పెదకాపు సినిమాలో తన సన్నివేశాలు కొన్ని ఎడిటింగ్లో తీసివేశారట..దీనివల్ల కథతో కనెక్షన్ మిస్సయిందనే భావన తనకు కలుగుతోందని తెలిపింది. అది తన తప్పు కాదని అలా అని తీయడాన్ని కూడా తప్పు పట్టలేమని తెలిపారు. శ్రీకాంత్ అడ్డాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా తెలియజేయడం జరిగింది అనసూయ.. అలాగే పెదకాపు-2 సినిమా కూడా రాబోతోంది మొదటి భాగాన్ని అర్థం కాని విషయాలను రెండవ భాగంలో చెప్పుకోబోతున్నట్లు తెలిపింది.