బిగ్ బాస్ షో గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడు దేశంలోనే ది బెస్ట్ షోగా రన్ అవుతున్న ఓ బుల్లితెర షో. కాస్త వెనక్కి వెళితే ఇది హాలీవుడ్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనవాళ్లు కూడా ఈ బిగ్ బాస్ షో ని బాగా రన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా అంతటా అన్నీ భాషల్లోనూ ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగులో ప్రసారం అయ్యే కార్యక్రమం టాప్ రేసులో దూసుకుపోతోంది. దీనికి కారణం అన్ని భాషలతో పోలిస్తే మనదానికి భారీ స్థాయిలో రేటింగ్ రావడమే. ఇప్పటి వరకు జరిగిన సీజన్లు అన్నీ ఇదే తరహా ఫలితాన్ని అందుకున్నాయి. ఈ మధ్యనే ప్రారంభమైన ఏడో సీజన్ సైతం దుమ్ములేపుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ షోలో ఎలిమినేషన్ జరిగింది. దాంతో దానిగురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. అవును, బిగ్ బాస్ ఏడో సీజన్లో ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్గా అవుతున్నాయి అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీనికి కారణం ఇప్పటి వరకూ ఈ సీజన్లో జరిగిన ఏడు ఎలిమినేషన్లలోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోవడం. బిగ్ బాస్ షోలో లేడీ విన్నర్లు లేరని అనుకుంటే.. ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో ఈ సీజన్పై విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి. తొమ్మిదో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అవును, ముఖ్యంగా శివాజి, ప్రియాంక జైన్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్లు బాగా ఎమోషనల్ అయిన సంగతి మీరు చూసే వుంటారు. మిగిలిన వాళ్లు కూడా తేజతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. టేస్టీ తేజ ఈ వారంలో సేఫ్ అవుతాడని శివాజి పదే పదే షోలో చెప్పడం జరిగింది. కానీ, అతడి లెక్క తప్పింది. ఫలితంగా తేజ ఈ వారంలో షో నుంచిఎలిమినేట్ అయిపోయాడు. ఇక చాలా మంది శివాజి తప్పు వల్లే తేజ ఎలిమినేట్ అయ్యాడని విమర్శిస్తున్నవారు లేకపోలేదు. ఎలిమినేషన్ ప్రకటించిన తర్వాత తేజ బయటకు వెళ్లే ముందు శివాజితో ‘అన్నా ఫ్యామిలీ వీక్లో అమ్మను హౌస్లోకి తీసుకు రావాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు అది తీరలేదు. అందుకే నామినేషన్ వేయొద్దు అని బ్రతిమాలాను కదా. మీరు వినలేదు. సరే మీరు ఇది మనసులో పెట్టుకోకండి!’ అంటూ ఎమోషనల్ అవుతూ వెళ్లిపోయాడు.