వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక లీక్ చేసిన ఉపాస‌న‌.. ఇంత‌కీ ఎక్కడో తెలుసా?

మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొన్నేళ్ల‌ నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్లతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు.

కొద్దిరోజుల క్రితం నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లి టైమ్ కూడా దగ్గర పడింది. ఆల్రెడీ వెడ్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెల‌బ్రేష‌న్స్ లో చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులు, చిరంజీవి ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు, పిల్లలు సహా అంద‌రూ పాల్గొన్నారు.

అయితే వెడ్డింగ్ డేట్ పై సరైన క్లారిటీ లేకపోయినా.. పెళ్లి వేదిక ఎక్క‌డో తెలిసిపోయింది. తాజాగా మెగా కోడలు ఉపాసన ఈ మేటర్ ను లీక్ చేసింది. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషష‌న్స్ కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఉపాసన.. ఇటలీలోని టుస్కానీ నగరంలో వివాహం జరగబోతున్నట్టు హిట్ ఇచ్చింది. ఇక పెళ్లి అక్టోబ‌ర్ లోనా లేక న‌వంబ‌ర్ లోనా అన్న‌ది తేలాల్సి ఉంది.