సౌత్ ఇండియాస్ట్రీలో టాప్-1 రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్..!!

సినీ రంగంలో ఒక వయసు దాటిన తర్వాత అవకాశాలు రావాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. హీరోలైతే ఇద్దరు పిల్లలు తండ్రి అయిన కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇండస్ట్రీలలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు కూడా హీరోలుగా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ల వయసుకే ఫెడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు.

Breaking! Nayanthara and Trisha to finally star in the same movie? - Tamil  News - IndiaGlitz.com

అలాంటి వారిలో త్రిష, నయనతార వంటి నటీమణులు ఎంతో ఏజ్ వచ్చిన ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరు కొలు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ హీరోలతో సమానంగా పలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా వీరు ఒక చిత్రానికి 10 నుంచి 11 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటిసారి దక్షిణాది భారత నటిగ నయనతార 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా గుర్తింపు పొందింది.

సౌత్ ఇండియాలో నయనతార కంటె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే నటి మరొకరు ఉన్నారట. ఆమె ఎవరో కాదు హీరోయిన్ త్రిష. నయనతార కంటే త్రిష ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. 40 ఏళ్లు దాటినా కూడా యూత్లో తన అందంతో బాగా ఆకట్టుకుంటోంది. తాజగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న సినిమాలు హీరోయిన్గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు కాను 12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గూగుల్ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్థానం నయనతార 11 కోట్లు ఆ తర్వాత మూడవ స్థానాల్లో అనుష్క శెట్టి 6కోట్లు ఉన్నది.