రాజమౌళి చేతుల మీదుగా శివన్న ఘోస్ట్ మూవీ ట్రైలర్.. రిలీజ్..!!

కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ శ్రీని. ప్రముఖ రాజకీయ నాయకులు నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కావడం జరుగుతోంది. ఇక శివరాజ్ కుమార్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతూ ఉన్నాయి.

Young Tiger is as good as NTR's mind.. Tarak fans are worried about  Shivanna's comments young

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను సైతం మొదలుపెట్టిన చిత్ర బృందంతో పాటు శివన్న కూడా చాలా నమ్మకంగా ఉన్నారు తాజాగా ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర ట్రైలర్ ని రాజమౌళి తన ట్విట్టర్ నుంచి రిలీజ్ చేశారు.. ట్రైలర్ విషయానికి వస్తే యుద్ధం మానవ ప్రపంచానికి ఒక మాయను గాయం ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలు ఎక్కువ అనే డైలాగుతో మొదలవుతుంది.

శివన్న ఈ ఏజ్ లో కూడా ఎంగేజ్గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. చివరిలో చెప్పే డైలాగు కూడా అందరు చేత ప్రశంసలు పలికించేలా కనిపిస్తోంది. ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, జయరాం పలువురు నటీనటుల సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. దీంతో పలువురు అభిమానులు ఘోస్ట్ సినిమా రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.