ర‌వితేజ‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన శిల్పా శెట్టి.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ కెరీర్ లో ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఇందులో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్​ అక్టోబ‌ర్ 20న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జ‌రుగుతోంది. మ‌రోవైపు ర‌వితేజ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లోనూ సినిమాను ప్ర‌మోట్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ర‌వితేజ బాలీవుడ్ లో స్టార్ బ్యూటీ శిల్పా శెట్టి హోస్ట్ చేసే ఓ షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. అయితే ఈ సంద‌ర్భంగా ర‌వితేజ‌తో క‌లిసి శిల్పా శెట్టి డ్యాన్స్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు నుండి హిట్ పాట అయిన `ఏక్ దమ్..` సాంగ్ కు ఇద్ద‌రూ మంచి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను శిల్పా శెట్టి స్వ‌యంగా ట్విట్ట‌ర్‌ ద్వారా పంచుకుంది. దీంతో ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.