మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత.. పోస్ట్ వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత.ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొన్నటికి మొన్న మాయోసైటిస్ తో బాధపడి ఇప్పుడిప్పుడే కోలు కుంటోంది. ఆ తరువాత అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నదని మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ గా మారాయి.. ఇక ఈమె లాస్ట్ సినిమా ఖుషి అయితే పర్వాలేదు అనిపించుకుంది.

అయితే సమంత మళ్లీ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్ పైనుంచిసెలైన్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు మళ్లీ ఆందోళనలో ఉన్నారు. అయితే ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి వివరాలను ఆమె పంచుకున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వలన.. శరీరానికి హాని కలిగించే సూక్ష్మక్రిములు,బ్యాక్టీరియా, ఇతర వాటితో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యమంటూ సెలైన్ ఫోటోపై రాసుకొచ్చారు సామ్. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే సమంత తన మావోసైటిస్ వ్యాధికి మానసికంగా శారీరికంగా ఈమె ట్రీట్మెంట్ ను బట్టి తెలుస్తోంది. ఈమె సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈషా ఫౌండేషన్ అలాగే బాలి లాంటి ప్రదేశాలకు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన స్నేహితురాలితో అమెరికాకు వెళ్లే ముందే బాలిలో వారిద్దరూ కలిసి అక్కడి ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలను కూడా మనకు షేర్ చేసింది.

అలాగే ఆమెకు ఆటో-ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతోంది.ఏదేమైనా సమంత అమెరికాలో ట్రీట్మెంట్ ముగించుకొని మళ్ళీ సినీ ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగాలని ఆమె అభిమానులు మరీ మరీ కోరుకుంటున్నారు. మరి కోలుకున్న తర్వాత సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.