సాయి మంజ్రేకర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అక్కర్లేదు. 2012లో ఓ మరాఠీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి మంజ్రేకర్.. ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన `దబాంగ్ 3` మూవీలో ఓ కీలక పాత్రను పోషించింది. గత ఏడాది మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోగా వచ్చిన `గని` మూవీతో సాయి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. గని తర్వాత మేజర్ మూవీలో మెరిసిన సాయి మంజ్రేకర్.. తాజాగా స్కంద మూవీతో ప్రేక్షకులను పలకరించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మాస్ మాసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూతురిగా సెకండ్ హీరోయిన్ రోల్ ను ఆమె పోషించింది.
ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సాయి మంజ్రేకర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తనకెంతో ఇష్టమని.. ఆయనతో ఒక్కసారైనా కలిసి యాక్ట్ చేయాలని ఉందంటూ మనసులో మాటలను ఓపెన్ గా బయటపెట్టేసింది. మరి ఈ యంగ్ బ్యూటీకి ఎన్టీఆర్ తో స్క్రిన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందో.. రాదో.. చూడాలి.