సీనియర్ స్టార్ హీరోయిన్, ఏపీ మంత్రి ఆర్కే. రోజా గురించి పరిచయాలు అవసరం లేదు. పాలిటిక్స్ లోకి వెళ్లాక సినిమాలు చేయడం మానేసిన రోజా.. బుల్లితెరపై పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించేది. అయితే మంత్రి అయ్యాక బుల్లితెరకు కూడా బై బై చెప్పేసింది. అలా రోజా ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే సినిమా చేస్తానంటోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.
తాజాగా `మీ కుడుపునిండా.. తెలుగువారి రుచులు` అనే రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోజా హాజరు అయింది. సీరియల్ నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు. అయితే ఓపెనింగ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన రోజా.. రిబ్బన్ కట్ చేసి శ్రీవాణి దంపతులకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఆపై మీడియాతో ముచ్చటించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలన్నీ `మీ కుడుపునిండా.. తెలుగువారి రుచులు` రెస్టారెంట్ లో దొరుకుతాయని.. తప్పకుండా అందరూ విజిస్ట్ చేయమని రోజా తెలిపారు.
అలాగే సినిమాల గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని రోజా తెలిపారు. అయితే కండీషన్స్ అప్లై అంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుకు తల్లిగా మాత్రం చేయనని.. వదిన, అక్క పాత్రలైతే యాక్సప్ట్ చేస్తానని రోజా పేర్కొన్నారు. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.