రైతు బిడ్డ పేరు జపం చేసిన అశ్విని… ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు ఎవరంటే…!!

నయని పావని ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్త కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా బిగ్ బాస్ విభజించాడు. నిన్న‌టితో ఆ బేధాలు చెరిపేసి అందరూ ఒకటేనని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఈవారం కంటెస్టెంట్లు ఎదుట ఉన్న కుండ‌ను పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రశాంత్.. సందీప్, తేజను నామినేట్ చేశాడు. ఇక అమర్.. అశ్విని, భోలే నీ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అశ్విని మాట్లాడుతూ అమర్దీప్ కు బదులుగా ప్రశాంత్.. ప్రశాంత్.. అనీ రైతు బిడ్డ పేరు జపం చేసింది. ఆ తర్వాత భోలేను నామినేట్ చేసిన అమర్ తన పాయింట్స్ ని చెప్పాడు. దానికి స్పందించిన భోలే నేను పదేళ్ల పిల్లాడిలా కనబడుతున్నానా అని అన్నాడు.

అనంతరం పూజా మూర్తి.. అశ్విని, భోలే ని నామినేట్ చేసింది. హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్ల కంటే భోలే, అశ్వినీకే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో అర్జున్, గౌతమ్, అమర్, భోలే, అశ్విని, తేజ, పూజ, శోభ, ప్రశాంత్ ఉన్నారు.